దేశంలో మరీ ముఖ్యంగా దేశ రాజధానిలో మహిళలపై జరుగుతున్న నేరాలు, అత్యాచారాలను కట్టడి చేయడంలో కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ అరోపించింది. ఈ నేపథ్యంలో క్రితంరోజు అర్థరాత్రి కాంగ్రెస్ నేతలు క్యాండిల్ లైట్ పాదయాత్రను నిర్వహించారు. మరీ ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావో, జమ్ముకాశ్మీర్ లోని ఖతువా అత్యాచార బాధితులకు అండగా నిలుస్తామన్న అభయాన్ని ఇస్తూ, ఖతువా బాధితురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఉన్నావ్ బాధితురాలి తండ్రి అత్మకు కూడా శాంతి చేకూరాలని క్యాండిల్ లైట్ యాత్ర చేపట్టారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక వాద్ర, అమె భర్త రాబర్ట్ వాద్రా, వారి పిల్లలతో పాటు కాంగ్రెస్ నేతలు, ముఖ్యులు, పార్టీ కార్యకర్తలు, ఇలా వందలాది మంది ఢిల్లీ వీదులు నిర్మానుష్యంగా మారిన క్రమంలో నడిరోడ్లపై శాంతియుతంగా శాంతియాత్రను కొనసాగించారు. అయితే గమ్యస్థానానికి చేరకునే క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, రాహుల్ అభిమానులు కొందరు రాహుల్ గాంధీ నాయకత్వం అంటూ నిరసన తెలుపుతూ సాగుతున్న శాంతియాత్రను కాస్తా.. రాజకీయ యాత్రగా మార్చేసారు. దీంతో అభిమానులు చేస్తున్న హంగామాపై ప్రియాంకా గాంధీ మండిపడ్డారు.
ఈ నిరసన ఎందుకు తెలియజేస్తున్నామో తెలుసుకోకుండా నినాదాలు ఏంటని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ అల్లరి చేసేవారు వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని గద్దించారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండి, మాట్లాడకుండా నడవాలని సూచించారు. ఏ కారణంతో ఇక్కడికి వచ్చామో అర్థం చేసుకుని బాధ్యతగల పౌరుల్లా కాంగ్రెస్ కార్యకర్తలు పని చేయాలని అన్నారు. కాగా, తన భర్త రాబర్ట్ వాద్రాతో కలసి వచ్చిన ఆమె, ఇండియా గేట్ వద్ద రాహుల్ నిరసనలో జత కలిశారు. ఈ దేశం తమకు భద్రత నిస్తుందని ప్రతి మహిళా నమ్మేలా పరిస్థితులు మారాల్సి వుందని ఈ సందర్భంగా ప్రియాంకా గాంధీ అభిప్రాయపడ్డారు.
శాంతియాత్ర తరువాత ఇండియా గేట్ కు చేరుకున్న తరువాత కార్యకర్తలను ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మహిళల పట్ల నేరాలు సంఖ్య విపరీతంగా పెరుగుతుందని, వాటిని నియంత్రించడంలో కేంద్రంలోని నరేంద్రమోడీ సహా బీజేపి పాలిత రాష్ట్రాలు కూడా పూర్తిగా విఫలమయ్యాయని అయన అన్నారు. అయితే మహిళల పట్ల జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా తాము ఈ శాంతిర్యాలీనిన నిర్వహించామమని, ఇది జాతీయ సమస్యగా పేర్కోన్న ఆయన ఇందులో రాజకీయ కోణాన్ని చూడలేమని అన్నారు. ఇది మన మహిళల కోసం, ఇంటి ఆడపడచుల కోసం చేస్తున్న పాదయాత్ర అని చెప్పారు. కేంద్రం ఆ దిశగా మహిళ రక్షణకు సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు.
WATCH: Priyanka Gandhi gets angry at the candlelight march, says 'Nobody will push each other. You should know the reason for which you are here. If you cannot behave go home. Now, all of you will silently walk till there' pic.twitter.com/Hlu9cSKOJG
— ANI (@ANI) April 12, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more