కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో మళ్లీ దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వయోవృద్దులు, ఫ్ఱంట్ లైన్ వారియర్స్ కు ఇప్పటికే టీకాను అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం.. ప్రజలందరినీ కరోనా నుంచి రక్షణ పోందేందుకు వ్యాక్సీలను తీసుకోవాలని కోరింది. కాగా తొలినాళ్లలో వ్యాక్సీన్ల ప్రభావం ఎంతమేరకు వుందన్న వివరాలు తెలియకపోవడంతో పాటు తీసుకున్న ఒకరిద్దరిలో దుఫ్ఫ్రభావాలు బయటపడటంతో పూర్తి సత్ఫలితాలను ఇచ్చే వాక్సీన్లు వచ్చే వరకు వేచి చూద్దామని పలువురు భావిస్తున్నారు. అయితే మన దేశంలో రూపోందని టీకాలన్నీ మంచి ఫలితాలనే అందిస్తున్నాయని గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ క్రమంలో పలు టీకాలు కూడా త్వరలోనే దేశ ప్రజల అందుబాటులోకి రానున్నాయి. కాగా బయోఎన్ టెక్ ఎస్, మోడెర్నా సహకారంతో ఫైజర్ సంస్థ తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ అత్యుత్తమంగా పనిచేస్తోందని యూఎస్ హెల్త్ కేర్ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ టీకా తీసుకున్న వారిలో రెండు వారాల్లోనే కరోనా సోకే అవకాశాలు 80 శాతం మేరకు తగ్గాయని, తొలి దశ టీకా తీసుకున్న వెంటనే యాంటీ బాడీలు పెరుగుతున్నాయని అధ్యయనం పేర్కొంది. రెండో షాట్ తీసుకున్న రెండు వారాలకు ఇన్ఫెక్షన్ రిస్క్ 90 శాతం తగ్గిందని, దాదాపు 4 వేల మందిని పరిశీలించి ఈ అధ్యయనం చేశామని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలియజేసింది.
ఈ వ్యాక్సిన్ కరోనా నుంచి రక్షణ కల్పించడంతో పాటు, వైరస్ శరీరంలోకి వెళితే, లక్షణాలను కూడా బయటకు కనిపించనివ్వడం లేదని వెల్లడించింది. అమెరికాలో జరుగుతున్న వ్యాక్సినేషన్ మంచి ప్రభావాన్ని చూపుతూ, ప్రజలను కరోనాకు దూరం చేస్తోందని సీడీసీ డైరెక్టర్ రోచెల్లీ వాలెన్ స్కీ వ్యాఖ్యానించారు. ఫైజర్ సంస్థ మెసింజర్ ఆర్ఎన్ఏ విధానంలో వ్యాక్సిన్ ను రూపొందించిందని గుర్తు చేసిన ఆయన, అమెరికాలో ఈ వ్యాక్సిన్ కే తొలుత వాడకానికి అనుమతి లభించిందని తెలిపారు.
డిసెంబర్ 14 నుంచి 13 వారాల పాటు సాగిన ఈ అధ్యయనం, మార్చి 13 వరకూ సాగిందని, మొత్తం ఆరు రాష్ట్రాల నుంచి టీకా తీసుకున్న వారిలో 3,950 మందిని పరిశీలించామని సీడీసీ పేర్కొంది. ఈ టీకా అమెరికాలోని హెల్త్ కేర్ పర్సనల్స్, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్స్, వయో వృద్ధులకు కొవిడ్ నుంచి నిజమైన రక్షణను అందిస్తోందని వాలెన్ స్కీ వ్యాఖ్యానించారు. కాగా, అమెరికాలో ఈ వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగం నిమిత్తం వాడేందుకు అనుమతి లభించగా, అప్పటి నుంచి భారీ ఎత్తున ప్రజలకు ఇస్తున్నారు. అయితే, ఈ వ్యాక్సిన్ ను అత్యంత శీతల ప్రదేశంలో భద్రపరచాల్సి వుండటంతో భారత్ సహా ఎన్నో దేశాలు ఈ వ్యాక్సిన్ సరఫరా కష్టమన్న ఉద్దేశంతో దూరం పెట్టాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more