త్వరలోనే భారత్ లోకి మరో కరోనా వ్యాక్సిన్ రానుంది. అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్ దిగుమతి కోసం మల్టీ నేషనల్ ఫార్మాసూటికల్ కంపెనీ సిప్లా.. చేసుకన్న ధరఖాస్తును పరిశీలించిన డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ-డీసీజీఐ) అత్యవసర వినియోగానికి అనుమతతులు మంజూరు చేసింది. భారత్ లో ఇప్పటికే సీరమ్ ఇన్ స్టిట్యూట్ తయారు చేసిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్ కు చెందిన కొవ్యాగ్జిన్, రష్యాకు చెందిన స్పుత్నిక్ కరోనా టీకాలు అందుబాటులో ఉన్నాయి.
కాగా, భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఏ తాజాగా మోడెర్నా కరోనా వ్యాక్సిన్ కు కూడా అనుమతులు మంజూరు చేసింది. దీంతో దేశంలో ఇప్పటివరకు అందుబాటులో వున్న వాక్సీన్లకు తోడు ఇది జతకలవనుంది. మోడెర్నా వ్యాక్సిన్ కూడా వాటి సరసన చేరిడంతో దేశంలో కరోనాకు మొత్తంగా నాలుగు టీకాలు అందుబాటులో వుండనున్నాయి. మోడెర్నా టీకాను (ఎంఆర్ఎన్ఏ) టెక్నాలజీతో అభివృద్ధి చేశారు. ఇది 90శాతానికిపైగా సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తేలింది. ఇప్పటికే చాలా ధనిక దేశాల్లో ఈ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి లభించింది.
దీంతో పాటు ఫైజర్ టీకా కూడా అమెరికా, బ్రిటన్ దేశాల్లో అందుబాటులో ఉంది. అమెరికాలో ఫైజర్, మోడెర్నా కలిపి ఇప్పటివరకూ 12కోట్ల మంది రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇక ఈ రెండు టీకాలు కలపి తీసుకున్నవారిలో అత్యధిక శాతం యాండీ బాడీలు తయారవుతాయని కూడా పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇక దీంతో పాటు ఈ రెండు టీకాలు కలిపి తీసుకుంటే జీవితకాలం యాంటీబాడీలు వృద్దిచెందుతాయని కూడా పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
అయితే ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లకు అధిక ధర, ఉత్పత్తి పరిమితులు, స్టోరేజీ, షిప్పింగ్ సమస్యలు వంటివి ఉండటం ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అడ్డంకిగా మారింది. భారత్లోనూ మోడెర్నా, ఫైజర్ టీకాలను అందుబాటులోకి తెచ్చేలా ఇటీవల డీసీజీఐ అనుమతి ప్రక్రియల్లో కొన్ని మార్పులు చేసింది. విదేశాల్లో అనుమతులు పొందిన టీకాలు దేశంలో క్లినికల్ ప్రయోగాలు నిర్వహించాల్సిన అవసరం లేదంది. అయితే విదేశీ కంపెనీలు డిమాండ్ చేస్తున్న ఇండెమ్నిటీ రక్షణపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో వీటి రాక ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more