దేశంలో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. దేశవాలీగా తయరైన రెండో టీకా త్వరలోనే వినియోగంలోకి రానుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్కు చెందిన జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన జై కొవ్-డీ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 12 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్లు వేయడానికి అత్యవసర వినియోగ అనుమతి కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకుంది. తమ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఇటీవలే ముగిశాయని ఆ సంస్థ తెలిపింది. జై కొవ్-డీ వ్యాక్సిన్ డీఎన్ఏ టీకా అని, వైరస్కు సంబంధించిన జన్యుకోడ్ను మన శరీరంలోకి తీసుకెళ్తుందని, దీంతో వ్యాధి నిరోధక శక్తి వస్తుందని ఆ సంస్థ తెలిపింది.
జై కొవ్-డీ వ్యాక్సిన్ ప్రపంచంలోనే కరోనా కట్టడికి అభివృద్ధి చేసిన తొలి డీఎన్ఏ టీకా. ఇప్పటికే దేశీయంగా కొవాగ్జిన్ ను అభివృద్ధి చేసి వినియోగిస్తోన్న విషయం తెలిసిందే. జై కొవ్-డీ వ్యాక్సిన్ ఆమోదం పొందితే రెండో దేశీయ కరోనా టీకాగా నిలుస్తుంది. ఈ టీకా గురించి ఇటీవలే నీతి ఆయోగ్ ఆరోగ్య సభ్యుడు వీకేపాల్ మాట్లాడుతూ... 28 వేల మంది వాలంటీర్లపై ఆ సంస్థ ప్రయోగాలు జరిపిందని వెల్లడించారు. దీనిపై అధ్యయనం దాదాపు ముగిసిందని అన్నారు. త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఇదే ప్రపంచపు తొలి కరోనా డీఎన్ఏ వ్యాక్సిన్ అని ఆయన కూడా తెలిపారు.
అత్యవసర అనుమతులు లభించగాకే టీకా ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. ఇప్పటికే దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ టీకాలకు అనుమతులు లభించిన విషయం తెలిసిందే. ఆయా వ్యాక్సిన్లు రెండు డోసులు వేసుకోవాల్సి ఉంటుంది. జై కొవ్-డీ వ్యాక్సిన్ మాత్రం మూడు డోసుల వ్యాక్సిన్. తొలి డోసు వేయించుకున్న తర్వాత 28 రోజులకి రెండో డోసు, 56 రోజులకి మూడో వేయించుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ చాలా కాలం నిల్వ ఉండాలంటే 2-8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద, కొద్ది కాలం నిల్వ ఉండాలంటే 25 డిగ్రీల సెల్సియస్ వద్ద స్టోర్ చేయాల్సి ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more