ఇష్టమైన వ్యక్తులపై ఒక్కోపర్యాయం మనం చూపించే అవితమైన ప్రేమానురాగాలు అవతలి వారికి ఇబ్బందికరంగానూ ఉండవచ్చు. ఇక జీవితాంతం ఈ ఇబ్భందులను భరించాల్సి ఉందా అన్న అనుమానాలతో వారు అందోళన చెందవచ్చు. ఈ ఆందోళన వారు విపరీత నిర్ణయాలకు కూడా కారణం కావచ్చు. ఇక కొత్త జంటల మధ్య ఈ అవగాహనా రాహిత్యాన్ని మరింత పెంచింది కరోనా లాక్ డౌన్. భార్యభర్తలు, పిల్లులు, అందరూ ఇళ్లలోనే బంధీలను చేసిన లాక్ డౌన్.. కనీసం ఇష్టమైన ఆహారాన్ని కూడా తిననివ్వకుండా చేసింది. అంటే ఇంట్లో తయారు చేసుకోలేని రుచికరమైన స్నాక్స్.. వగైరాలను దూరం చేసింది. ఇంటి భోజనమే శ్రేష్ఠకరమైన బోజనమని చాటింది.
ఇదిలావుంచితే ఈ కరోనాకు ముందుకు బ్రేక్ అప్ తీసుకున్న ఓ జంటను మాత్రం లాక్ డౌన్ మరింత క్షోభ పెట్టింది. మరీ ముఖ్యంగా ప్రియురాలిని మాత్రం తన మాజీ ప్రియుడిపై అసూయతో రగిలిపోయేలా చేసింది. కారణాలు తెలియదు కానీ ఎందుకనో విడిపోయిన ఈ జంటలోని ప్రియురాలు మాత్రం అసూయతో రగిలిపోయేలా చేసింది. అంతే లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత అమె ఏకంగా తన మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకునేలా చేసింది. అయితే ఈ ప్రయత్నంలో అమె మరణం అంచుల వరకు వెళ్లాల్సివచ్చింది. ఔనా.. ప్రతీకారం ఎదుటివారిపై తీర్చుకున్నా.. ఇలా జరుగుతుందా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయా.?
ఆ వివరాల్లోకి వెళ్తే.. అగ్రరాజ్యం అమెరికాలోని ఓ జంట కరోనా తొలిదశ ప్రపంచవ్యాప్తంగా విజృంభించే క్రమంలో విడిపోయింది. ఆ వెంటనే లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఇక లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత ప్రియుడిపై ప్రియురాలు ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. అంతే ఒక డబ్బాలో పెట్రోల్ నింపుకుని అగ్గిపెట్ట పట్టుకుని ప్రియుడి కారు పార్క్ చేసిన ప్రాంతానికి వెళ్లిందీ యువతి. అక్కడ ప్రియుడి కారును చూడగానే కిటికీ అద్దాలను ధ్వంసం చేసి కారు లోపలి సీట్లపై పెట్రోల్ పోసింది. ఇక నిప్పు పెట్టేందుకు అగ్గిపుల్ల గీసి అద్దాలోంచి కారులోపలికి ముఖం పెట్టి నిప్పు పెట్టింది.
ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున అంటుకోవడంతో అమె ముఖంపై కూడా మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో కిటికీలోంచి తలను భయటకు తీసినా.. అగ్గికీలల వ్యాప్తి వేగానికి అమె తట్టుకోలేక కిందపడింది. ఆమె ముఖానికి మంటల సెగ తగిలినంతగానే అమె వేగంగా తల తీసినా మంటలు కూడా బయటకు వచ్చాయి. దీంతో అమె మరోకారుపైకి ఎగిరి.. కిందపడింది. ఆ తరువాత మోకాళ్లు, చేతులపై కాసింత దూరం నడుచుకుంటూ కొంత దూరం వెళ్లింది. ఆతరువాత వెంటనే వెనక్కు వచ్చి పెట్రోల్ డబ్బాతో పాటు ఇతర వస్తువులను తీసుకుని జారుకుంది. ఈ ఘటన ఉత్తర్ టెక్సాస్ ప్రాంతంలోని వాణిజ్య నగరమైన డల్లాస్ లో జరిగింది. సరిగ్గా జూలై 2020లో చోటుచేసుకున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more