దేశరాజధాని ఢిల్లీలో సినీపక్కీలో ఛేజింగ్ చేసుకుంటూ పోలీసులు ఓ డగ్ర్స్ రవాణా చేస్తున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కోటి రూపాయలకు పైగా విలువైన 1.010 కేజీల మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న 25 ఏళ్ల మోడల్ను, అతడి గాళ్ ఫ్రెండ్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను శుభమ్ మల్హోత్రా అలియాస్ సన్నీ అతడి స్నేహితురాలు కీర్తి(27)గా గుర్తించారు. వీరిద్దరూ ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీ చుట్టుపక్కల కొందరు డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టిన పోలీసులు ఈ రాకెట్లో సన్నీ ప్రధాన పాత్రధారని గుర్తించారు.
హిమాచల్ ప్రదేశ్లోని మలానా నుంచి సన్నీ డ్రగ్స్ తీసుకొచ్చి ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంతంలో విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లో రెండుమూడు రోజులు గడిపిన సన్నీ సింగు సరిహద్దు మీదుగా తన కారులో ఉదయం ఆరేడు గంటల సమయంలో ఢిల్లీ వస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. సింగు సరిహద్దు వద్ద కాపు కాసిన పోలీసులు అతడి కారును ఆపాలని ప్రయత్నించినా భారీవర్షానికి తోడు అతడు అత్యంత వేగంగా దూసుకెళ్తుండడంతో పోలీసుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే పోలీసులు మాత్రం తమ టార్గెట్ ను మిస్ చేసుకోదలచుకోలేదు.
దీంతో ఓ బృందం అతడి కారును అనుసరించగా, మరో బృందం అతడు నివసించే ఓల్డ్ గుప్తా కాలనీకి వెళ్లింది. 45 నిమిషాల ఛేజింగ్ తర్వాత ఓల్డ్ గుప్తా కాలనీలో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. 2016లోనే తనకు ధూమపానం, డ్రగ్స్ అలవాటయ్యాయని, ఖర్చుల కోసం స్నేహితులకు డ్రగ్స్ అమ్మడం ప్రారంభించానని పోలీసుల విచారణలో సన్నీ పేర్కొన్నాడు. ఇందులో పెద్ద ఎత్తున లాభాలు వస్తుండడంతో హిమాచల్ప్రదేశ్లోని కసోల్, మలానా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్టు చెప్పాడు. తనకు సాయంగా ఉండేందుకు స్నేహితురాలైన కీర్తిని కూడా ఇందులోకి దింపినట్టు చెప్పాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more