దేశ ఆస్తులను తన దోస్తులకు ప్రధాని మోదీ అమ్మేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేయరా? అని ప్రశ్నించారు. ధరల పెరుగుదల, నిత్యవసర వస్తువులపై జీఎస్టీ పెంపు, నిరుద్యోగం వంటి సమస్యలపై కాంగ్రెస్ పార్టీ శుక్రవారం దేశ వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రపతి, ప్రధాని మోదీ నివాసాలకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు ప్రయత్నించారు. అయితే పోలీసులు వీరిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.
కాగా, పోలీస్ వాహనంలో కూర్చొన్న ప్రియాంక గాంధీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ద్రవ్యోల్బణం గురించి కేంద్ర మంత్రులకు పట్టడం లేదని మండిపడ్డారు. వారికి అసలు ధరల పెరుగుదలే కనిపించకపోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. గ్యాస్ సిలిండర్ ధర అమాంతం పెరిగి.. గ్రామీణ ప్రజలు మళ్లీ కట్టెల పోయిలకు చేరువవుతున్నారని అమె అవేదన వ్యక్తం చేశారు. అందుకే ధరల పెరుగుదలను చూపించేందుకు ప్రధాని మోదీ నివాసం, రాష్ట్రపతి భవన్కు ర్యాలీ తలపెట్టినట్లు తెలిపారు.
हमारे नेता @RahulGandhi जी ने कहा तो था कल- "सच को बैरिकेड नहीं किया जा सकता है" और आज @priyankagandhi जी को पुलिस के बैरिकेड रोक नहीं पाए।#महंगाई_पर_हल्ला_बोल pic.twitter.com/OgLelTM5R8
— Congress (@INCIndia) August 5, 2022
స్వతంత్ర భారతవని బానిస సంకెళ్లలను తుంచుకున్ననాటి నుంచి ఒక్కో రూపాయి పోగుచేసుకుని సంపాదించిన ఆస్తులన్నింటినీ తన మిత్రులైప పారిశ్రామికవేత్తలకు అమ్మేయడం ఎక్కడి దేశభక్తి అని ఆమె ఆరోపించారు. ఇదేనా దేశ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా భారత మాతకు మీరిచ్చే కానుక అని నిలదీశారు. దేశ జాతీయ ఆస్తులను తన సొంత ఆస్తులుగా మిత్రులకు కట్టబెట్టడంపై ఎందుకు ఈడీ సహా జాతీయ దర్యాప్తు సంస్థలు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. దీనిపై దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ये संघर्ष सड़क का है...इस संघर्ष में समझौता मंजूर नहीं।@priyankagandhi जी का ये संदेश हर कांग्रेसजन का संदेश है।#महंगाई_पर_हल्ला_बोल pic.twitter.com/6RHFu0OuXQ
— Congress (@INCIndia) August 5, 2022
#WATCH | They (BJP) think Opposition can be muzzled. As their ministers can't see inflation, we want to show them inflation by marching towards PM house...PM Modi has handed over the assets of country to his friends:Congress General Secretary Priyanka Gandhi Vadra
— ANI (@ANI) August 5, 2022
(Source: AICC) pic.twitter.com/PWtH7EC2dI
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more