అల్లు అర్జున్ నటించిన రేసు గుర్రం సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటుడు రవికిషన్. సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించి మెప్పించిన ఈ నటుడు అదే చరిష్మాతో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్ సీఎం కాకముందు ప్రతినిథ్యం వహించిన గోరఖ్ పూర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి 2019 నుంచి బరిలో దిగి గెలిచిన ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. ఎంపీగా కొనసాగుతున్న రవికిషన్ తాజాగా తన స్నేహితుడి, వ్యాపారవేత్తపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
2012లో తాను ఇచ్చిన డబ్బును తన స్నేహితుడు, ముంబైకి చెందిన వ్యాపారవేత్త జైన్ జితేంద్ర రమేశ్ తిరిగి చెల్లించడం లేదని పిర్యాదు చేశారు. రవికిషన్ తన స్నేహితుడైన జితేంద్ర రమేశ్ కు రూ.3.25 కోట్లు రుణంగా ఇచ్చారు. జైన్ జితేంద్ర రమేశ్ ఆ నగదును తిరిగివ్వడంలో భాగంగా రవికిషన్కు రూ.34 లక్షల చొప్పున 12 చెక్కులను అందజేశాడు. అయితే రవికిషన్ వాటిలో ఒక చెక్కును గతేడాది డిసెంబర్ 7న గోరఖ్పూర్ ఎస్బీఐ బ్రాంచ్ లో డిపాజిట్ చేశారు. కానీ ఆ చెక్కు బౌన్స్ అయింది. ఆ తర్వాత రవికిషన్ స్నేహితుడు జైన్ జితేంద్ర రమేశ్కు తరచూ ఫోన్ చేసినా సరైన సమాధానం ఇవ్వలేదు.
జైన్ జితేంద్ర నుంచి స్పందన సరిగా లేకపోవడంతో గోరఖ్పూర్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేసినట్టు రవికిషన్ పీఆర్వో పవన్ ధూబే తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కంటోన్మెంట్ పీఎస్ ఇన్చార్జ్ శశి భూషణ్ రాయ్ తెలిపారు. రవికిషన్ తెలుగులో సైరా నరసింహారెడ్డి, ఎంఎల్ఏ, సాక్ష్యం, ఎన్టీఆర్ కథానాయకుడు, లై, రాధ, సుప్రీమ్, కిక్ 2, హీరో చిత్రాల్లో నటించారు. భోజ్పురి, హిందీ, కన్నడ, తెలుగు భాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు రవికిషన్. 2019 నుంచి యూపీలోని గోరఖ్పూర్ లోక్సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more