తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం నాటికి ఈ వేడుకలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. గరుడ వాహనసేవ నిర్వహణ రోజుకు ప్రత్యేకమైన విశిష్టత ఉండటంతో తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు పలు రాష్ట్రాల భక్తులు కూడా తిరుమల కొండకు పోటెత్తారు. శనివారం రాత్రి గరుడ వాహనసేవలో పాల్గొనేందుకు విశేష సంఖ్యలో భక్తజనం తిరుమలకు పోటెత్తింది. తిరుమల మొత్తం భక్తులతో నిండిపోయింది. దాదాపు 4.50 లక్షల మంది గరుడవాహన సేవను తిలకిస్తారని టీటీడీ అధికారులు అంచనావేస్తున్నారు.
భక్తులందరికి గరుడ వాహన సేవలో పాల్గొనే అవకాశాన్ని కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహనసేవను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల సంఖ్య విశేషంగా ఉండటంతో తిరుమల గిరులు స్వామివారి నామంతో మార్మోగిపోతున్నది. గరుడ వాహన సేవలో దాదాపు 4.50 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉన్నది. ఇప్పటికే నాలుగు లక్షల మేర భక్తులు తిరుమలకు చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
గరుడ వాహనసేవ సందర్భంగా 5వేల మందితో పోలీసులు భద్రతనిర్వహిస్తున్నారు. గ్యాలరీల్లో ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు అన్నప్రసాదాలు, తాగునీరు కల్పిస్తున్నారు. మాడ వీధుల్లో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. గరుడ సేవలో స్వామి వారికి అలంకరించేందుకు ప్రత్యేక గొడుగులు శుక్రవారం తిరుమలకు చేరాయి. చెన్నైలోని హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ ఆర్ఆర్ గోపాల్జీ ఆధ్వర్యంలో తిరుమల చేరిన గొడుగులకు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. గరుడ వాహన సేవకు చేపట్టిన ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తనిఖీ చేశారు. మాడ వీధులు, గ్యాలరీల్లో భక్తులకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు.
టీటీడీ ఏర్పాట్లు చాలా బాగున్నాయని సుబ్బారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. పలువురు భక్తులతో మాట్లాడి టీటీడీ సేవల గురించి ఆరా తీశారు. వాహనసేవను దర్శించుకున్న అనంతరం భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా నిర్దేశిత మార్గాల ద్వారా వెలుపలికి వెళ్లేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్, భద్రతా సిబ్బందికి సూచించారు. కాగా, గరుడ వాహనసేవకు యాత్రికులు పోటెత్తుతుండటంతో రవాణా సౌకర్యాల్ని మెరుగుపరిచారు. ప్రతి నిమిషానికి రెండు బస్సులను కొండపైకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. తిరుమలకు వెళ్లే ప్రైవేటు వాహానాలను అలిపిరి టోల్గేట్ వద్దే పోలీసులు నిలిపివేస్తున్నారు. దాంతో అలిపిరి నుంచి కపిల తీర్థం వరకు వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more