విజయవాడలోని ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరవరోజు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు అర్చకులు. ఈ తొమ్మిది రోజలు పాటు అమ్మవారు ప్రతిరోజు ఒక్కో అవతారంలో భక్తలకు దర్శనాన్ని అనుగ్రహిస్తారు. దేవి శరన్నవరాత్రులు అక్టోబర్ ఆరవ తేదీ వరకు కొనసాగుతాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ, రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది.
తొలిరోజు దుర్గమ్మ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా కనకదుర్గమ్మ దేవీ భక్తులను అనుగ్రహించగా, రెండవ రోజూన బాలత్రిపుర సుందరి అవతారంలో, మూడవ రోజున గాయత్రీ దేవిగా.. నాల్గవ రోజున శ్రీ అన్నపూర్ణ దేవిగా.. ఐదవ రోజున లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనవిచ్చిన కనకదుర్గమ్మతల్లి..ఆరవ రోజున శ్రీ మహాలక్ష్మీ దేవిగా, ఏడవ రోజున మూలా నక్షత్రయుక్తమున సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ముందునుంచి అంచనా వేసినట్లు ఆదివారం మూలా నక్షత్రం రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గత రెండేళ్లు కొవిడ్ కారణంగా దర్శనాలకు రాలేకపోయిన భక్తులు.. ఒక్కసారిగా ఆలయానికి మూలానక్షత్రం రోజున పోటెత్తారు.
సరస్వతీదేవి రూపంలోని అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన వారితో ఉదయం నుంచి తిరిగి రాత్రి వరకూ క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఇక ఎనమిదవ రోజున కనకదుర్గమ్మ తల్లి దుర్గమ్మతల్లిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. శరన్నవరాత్రులలో ఏడవ రోజు అమ్మవారు దుర్గమ్మ దేవిగా అనుగ్రహిస్తున్న తరుణంలో అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దీంతో ఆలయం వద్ద క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.
దసరా ఉత్సవాలలో ఎనిమిదో రోజు సోమవారం అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనుంది. ‘లోక కంఠకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగొందింది. దుర్గమాసురుడిని సంహరించిన తర్వాత కీలాద్రిపై అమ్మవారు స్వయంగా ఆవిర్భవించింది. దుర్గే దుర్గతినాశని.. అనే వాక్యం శుభాలను కలగజేస్తుంది. శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గాదేవిని దర్శించుకోవడం వల్ల దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం’. దివ్యరూపిణి అయిన దుర్గమ్మ దర్శనానికి ఏటా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more