టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ వార్త.. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఇక నిప్పు లేకుండానే పోగవస్తుంటూ ప్రచారం చేసే సోషల్ మీడియా.. ఇప్పడీ వార్తను సంచలనంగా మార్చేసింది. అయితే మంచు మనోజ్ ఈ సారి మాత్రం పెద్దలు కుదిర్చిన వివాహం కాకుండా ప్రేమించి పెళ్లి చేసుకోనున్నాడని బలమైన వార్తలు వినబడుతున్నాయి. అయితే మంచు మనోజ్ ఈ సారి చేయి పట్టుకుని పాణిగ్రహణం చేయబోనున్న వధువు ఎవరో తెలుసా.?
తెలుగు రాష్ట్రాల్లో బలమైన నేతలుగా ఎదిగిన దివంగతులైన భార్యాభర్తల కనిష్ట పుత్రిక. వారు ఎవరంటే.. మాజీ ఎంపీ దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇంత సడన్ గా ఈ వార్త ఎందుకిలా గుప్పుమనిందో తెలుసా.? మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిలు కలిసి.. క్రితం రోజు రాత్రి సికింద్రాబాదులోని ప్రముఖ క్షేత్రమైన శ్రీ సిధ్దిగణపతి దేవాలయానికి రావడం ఈ వార్తలకు బలం చేకూరింది. ఇద్దరు కలిసి వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మనోజ్ మాట్లాడారు.
భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకోబుతున్నారా.? అని మీడియా అడిగిన ప్రశ్నకు పర్సనల్ విషయాలు పబ్లిక్ గా చెప్పడం సమంజసం కాదని.. మాట దాటవేశారు. అయితే ఈ లోపు ఓ సంకేతాన్ని మాత్రం అందించారు. ఓ మంచి రోజు చూసుకుని తానే అందరికీ విషయం చెబుతానని అన్నాడు. అదేవిధంగా సినిమాలు, రాజకీయాల్లోకి వచ్చే విషయంపై అడగ్గా.. వాటి గురించి కూడా త్వరలో మాట్లాడుతానని.. ప్రస్తుతం వినాయకుడి గురించి మాట్లాడుకుందామంటూ మంచు మనోజ్ సమాధానం ఇచ్చాడు. మంచు మనోజ్కు ఇదివరకే హైదరాబాద్కు చెందిన ప్రణతీ రెడ్డితో వివాహం జరిగింది. నాలుగేళ్లపాటు కొనసాగిన వీరి బంధం 2019లో విడిపోయింది.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more
May 19 | సీనియర్ కమేడియన్ అలీ అధికార వైసీపీ పార్టీకి రాజీనామా చేయనున్నారా.? అంటే ఔనన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అధికార వైసీపీ పార్టీలో సినీమారంగం నుంచి ఆశించినంత స్థాయిలో మద్దతు లేదు. జగన్ సర్కార్ అధికారంలోకి... Read more