1. వగవకు గడిచిన దానికి
బొగడకు దుర్మతులనెపుడు పొసగని పనికై
యేగి దీనత నొందకుమీ
తగదైవగతిం బొసంగు ధరను కుమారా!
తాత్ఫర్యం : ఓ కుమారా! అయిపోయిన పని గురించి చింతింపవద్దు. దుష్టులను మెచ్చుకొనవద్దు. నీకు సాధ్యము కాని దానిని పొందలేక పోతినని చింతిచుట పనికిరదు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందుము.
2. ధరణీనాయకు రాణియు
గురురాణియు నన్నరాణి కులకాంతను గ
న్నరమణి దను గన్నదియును
ధర నేవురు గల్లులనుచు దలపు కుమారా!
తార్ఫర్యం: ఓ కుమారా! రాజు భార్యయును, గురు భార్యయును, అన్న భార్యయును, అత్తయును, ఈ ఐదుగురు తల్లులని భావింపవలెను.
- పక్కి లక్ష్మీ నరసింహ కవీంద్రుడు
(And get your daily news straight to your inbox)