మీ త్లలిదండ్రుల ఇంట్లోంచి మిమ్మల్ని వెళ్లిపోమని అన్నారంటే అందుకు గల కారణాలను తెలిపాలి. మంచి పనులు చేస్తే వెళ్లిమన్నారా..? లేక దేని గురించి వెళ్లిపోమన్నారన్నది మీరు తెలియజేయలేదు. ఇక మంచి పనులతో ఇబ్బందులు వస్తాయని తెలిసినప్పుడు కూడా తల్లిదండ్రులు మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్లిపోమ్మని అనరు. సమస్య ఎక్కడుందో అక్కడికి వెళ్లి తెలియక జరిగింది క్షమించమని వారే మీ కన్నా ముందు చర్యలు తీసుకుంటారు.
ఇక తల్లిదండ్రులు కొడుకులు ఎంత వెదవ పని చేసినా.. ఇంటి పట్టునే వుండు.. ఇంట్లోంచి ఎక్కడికీ వెళ్లకు అని అంటారు.. కానీ వెళ్లిపోమ్మని చెప్పేదాక పరిస్థితి వచ్చిందంటే.. కారణాలను అర్థం చేసుకోగలం. దీనికి తోడు మీ ప్రశ్నలోని రెండో భాగంలో వింటూనే అర్థమవుతుంది. అయితే వారు నివాసముంటున్న ఇళ్లు ఎవరిది..? వారికెలా సంక్రమించింది. వారి తాత, తండ్రుల ద్వారా వచ్చిందా.? లేక వారి స్వార్జితమా..? అన్నది కూడా మీరు స్పష్టం చేయలేదు.
మొదటిది వారికి ఒకవేల తాత, తండ్రుల నుంచి సంక్రమించిన అస్తి అయినా అది మీకు చెందదు. తాతా ఆస్తిపై మనుమళ్లకు మాత్రమే హక్కు వుంటుంది కాబట్టి.. మనమళ్లు మేజర్లుగా మారిన తరువాతే అస్తి లభిస్తుంది. ఇక రెండో అంశానికి వస్తే మీరు తెలిపిన ఆస్తి వారి స్వార్జితమైతే.. ఏ కోశానా అది మీకు మీ పిల్లలకు చెందదు. అది పూర్తిగా వారి ఇష్టంపైనే అధారపడి వుంటుంది. తాజాగా ఢి్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో తల్లిదండ్రుల ఇంట్లో ఉండేందుకు కుమారులకు ఎలాంటి చట్టపరమైన హక్కూ లేదని తీర్పును వెలువరించింది.
అమ్మానాన్నల దయతో మాత్రమే వారింట్లో బిడ్డలు ఉండవచ్చని, అలాగని కొడుకును జీవితాంతం భరించాల్సిన అవసరం కూడా లేదని జస్టిస్ ప్రతిభా రాణి తీర్పును వెలువరించారు. ఇక స్వార్జితంతో సంపాదించిన ఇల్లయితే... కుమారుడు అవివాహితుడా, వివాహితుడా అన్న మీమాంస కూడా అవసరం లేదని తెలిపారు.
ఢిల్లీలోని నాగోలి ప్రాంతానికి చెందిన సచిన్ అనే వ్యక్తి.. తన తల్లిదండ్రులకు సానుకూలంగా కింది కోర్టులో తీర్పు వచ్చిన నేపథ్యంలో దానిని సవాల్ చేస్తూ.. ఢిల్లీ న్యాయస్థానాన్ని అశ్రయించాడు. తల్లిదండ్రులకు అనుకూలంగా కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ కొడుకు వేసిన పిటిషన్ను హైకోర్టు కోట్టివేసింది. తాము కష్టపడి సంపాదించి రెండు అంతస్థులు నిర్మించుకున్న ఇంటిని తమ కోడుకులు అక్రమించి.. తమను హింసిస్తున్నారని, ఇంటి విద్యుత్ చార్జీలు, పన్నులను సైతం కట్టకుండా వేదిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు
తమ కొడుకులను తక్షణం తమ ఇల్లు ఖాళీ చేయించాల్సిందిగా కోరడంతో కిందికోర్టు తల్లిదండ్రులకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. దీనిన హైకోర్టులో సవాల్ చేసిన కొడుకులకు అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. దీంతో తల్లిదండ్రుల అనుమతి, దయతో మాత్రమే మీరు ఇంట్లో వుండే అవకాశం వుంది.కన ఇంటినళ్లలో ఉంటున్న ఇద్దరు కొడుకులు, కోడళ్లను ఖాళీ చేయించాలని, వారు తమను హింసిస్తున్నారంటూ వృద్ధ దంపతులు కోర్టును ఆశ్రయించారు.
(And get your daily news straight to your inbox)
Mar 16 | తన భర్తకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తిని.. అతడి మరణం తరువాత తమ కుటుంబంలోని వ్యక్తులకు అందించవచ్చునని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెల్లడించింది. కుటుంబం అంటే కేవలం భర్త తరపు వారు మాత్రమే కాదని..... Read more
Oct 03 | నేను ముస్లిం.. నాకు బాల్యవివాహాల చట్టం వర్తిస్తుందా..? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ మద్రాసు కోర్టు తరువాత గుజరాత్ హైకోర్టు కూడా బాల్య వివాహ నిరోధక చట్టంపై స్పష్టమైన అదేశాలను జారీ చేసింది. ఈ... Read more
Jul 15 | నాకు డయాబిటిస్ వుంది..? నాకు వారసత్వంగా షుగర్ వ్యాధి సంక్రమించింది. అయితే నేను ప్రభుత్వ ఉద్యోగానికి పనికిరానా..? అన్న ప్రశ్న సాధరణంగా చాలా మందిలో తలెత్తుతుంది. అయితే తాజాగా మద్రాసు హైకోర్టు వెల్లడించిన తీర్పు... Read more
Jul 02 | నేను నా భర్తకు రెండో భార్యను, ఆయన మొదటి భార్య 2005లోనే కన్నమూసింది. ఆయన కూడా 2011లో మరణించారు. ఈ నేపథ్యంలో నాకు నా భర్త పించను లభిస్తుందా..? అన్న సందేహాలు చాలా మంది... Read more
Jun 24 | భర్త నుంచి విడాకులు పోందకుండా సెపరేట్ గా వుండటం సాధ్యమేనా..? ఈ ప్రశ్న ఉదయించింది కొత్తగా ఫెళ్లైన యువ జంటలో కాదు. పాతికేళ్లు భర్తతో కలసి సంసారం చేసిన ఓ భార్య మదిలో.. ఇన్నాళ్ల... Read more