ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్ కోసం మెగా వేలంకు సమయం దగ్గరపడడంతో ఆయా జట్లు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సిద్దం చేస్తున్నాయి. ఈ లిస్ట్ను జట్లు నవంబర్ 30 లోపు ఐపీఎల్ నిర్వాహకులకు అందజేయాలి. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో కూడా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్గా సంజూ శాంసన్ను కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే గత ఏడాది మాదిరిగా కాకుండా కొంత రెన్యూమరేషన్ పెంచుకునేలా రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యాన్ని ఒప్పించడంలో సంజు సఫలీకృతం అయ్యాడు.
తాజాగా అందిన సమాచారం ప్రకారం.. 14 కోట్లకు అతడు రాజస్తాన్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. స్టీవ్ స్మిత్ ఢిల్లీ జట్టులో చేరడంతో ఐపీఎల్ 2021 సీజన్లో కెప్టెన్సీ పగ్గాలను సంజూ శాంసన్కు రాజస్తాన్ అప్పజెప్పింది. కాగా 2018లో శాంసన్ను 8 కోట్లకు రాజస్తాన్ కొనుగోలు చేసింది. కాగా ఈ సారి మాత్రం ఆయన ప్యాకేజీని ఏకంగా రూ.14కోట్లకు పెంచేసింది. అంతే కాకుండా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్, లియామ్ లివింగ్ స్టోన్ పేర్లు రిటైన్ చేసుకోనే లిస్ట్లో ఉన్నట్టు సమాచారం.
అదే విధంగా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ను రిటైన్ చేసుకుంటారా లేదా అన్న అంశంపై ఎటువంటి సమాచారం లేదు. ఎందకంటే మానసిక ఆరోగ్య సమస్యల దృష్ట్యా క్రికెట్ నుంచి స్టోక్స్ నిరవధిక విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది14వ సీజన్లో శాంసాన్ అద్బుతంగా రాణించాడు. 14 మ్యాచ్లలో సంజూ 484 పరుగులు చేశాడు. కాగా సోషల్ మీడియాలో రాజస్థాన్ రాయల్స్ను ఆన్ ఫాలో చేసిన శాంసన్ జట్టును వీడి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అతడు చేరనున్నట్లు వార్తలు వచ్చాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more