ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత్ కు మరో స్వర్ణం వచ్చింది. వరుసగా మూడు రోజుల నుండి ఒక్కటే విభాగంలో భారత క్రీడాకారులు స్వర్ణ పతకాలను సాధిస్తున్నారు. తొలి రోజు ఇదే వెయిట్ లిఫ్టింగ్ క్రీడలోనే మీరాబాయి చాను తొలి స్వర్ణాన్ని అందించగా, మలి స్వర్ణాన్ని మరో వెయిట్ లిఫ్టర్ సంజిత చాను నిన్న భారత్ కు అందించింది. ఇక మూడవ రోజు ఈ బాధ్యతను పురుష క్రీడాకారులు తమ భుజాలపై వేసుకున్నారు.
పసిడిని సాధించాటన్న పట్టుదలతో వున్న సతీష్ కుమార్ శివలింగం తన ప్రత్యర్థుల కంటే అధికంగా వెయిట్ లిఫ్టింగ్ చేసి భారత మాత సిగలోకి మరో పసిడిని చేర్చాడు. రెండు రౌండ్లలో కలసి సతీష్ కుమార్ మొత్తంగా 317 కిలోల బరుపును ఎత్తాడు. తనకు పోటీగా బరిలో నిలిచిన ఇంగ్లాండ్ క్రీడాకారుడు జాక్ ఒలివర్ 312 కిలోలు, అస్ట్రేలియాకు చెందని ప్రాన్ కోయిస్ ఇటౌండీ 305 కిలోల బరువును ఎత్తారు.
దీంతో సతీష్ కుమార్ శివలింగానికి స్వర్ణ పతకం వరించింది. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. కాగా సతీష్ కుమార్ శివలింగంపై దేశవ్యాప్తంగా నెట్ జనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మాజీ డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా అభినందించారు. ఉదయాన్నే మరో శుభవార్తను చెప్పారని.. కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేశాడు. ఇక తమకు సరైన ఫిక్సోధెరఫిస్టు, కోచ్ లు లేరిని పేర్కొంటూ ఇటీవల శివలింగం పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more