సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రంలో ఆయన లవర్ బోయ్గా కనిపిస్తూనే కామెడీ టైమింగ్, పంచ్ డైలాగులతో నిండిన ట్రైలర్ అద్భుతంగా ఉంది. ట్రైలర్ మధ్యలో మహేష్ శ్రీకాకుళం యాసలో చెప్పిన డైలాగులు ఫన్నీగా ఉన్నాయి. కీర్తి సురేశ్ చాలా అందంగా కనిపిస్తోంది. బ్యాంక్ స్కామ్ నేపథ్యంలో సాగే ఈ కథలో మహేష్ అభిమానులకు కావాల్సిన యాక్షన్, కామెడీ, రొమాన్స్లను చేర్చినట్లుగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో అభిమానుల్లో చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మే 12న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ధరలను పెంచుకునేందుకు అనుమతిచ్చింది. దీంతో పాటుగా అదనపు ఆటను వేసుకునేందుకు కూడా అనుమతి కూడా ఇచ్చింది. 5వ షో వేసుకునేందుకు మే 12 నుంచి 18 వరకు అవకాశం ఇచ్చింది. వారం రోజుల పాటు ఈ చిత్రం మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో రూ.50 పెంచుకునేందుకు అనుమతివ్వగా.. ఏసీ సాధారణ థియేటర్లో రూ.30 పెంచుకునే అవకాశం కల్పించింది. ఇక అటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ చిత్రం టికెట్ ధరలను పెంచుకునేందుకు చిత్రబృందం అనుమతి కోరింది.
మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేనీ, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంతోని ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మహేష్.. త్రివిక్రమ్ డైరక్షన్లో ఓ సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. ఇది కాకుండా టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళితోనూ ఓ చిత్రం చేయబోతున్నారు మహేశ్. ఈ సినిమా కోసం సూపర్ స్టార్తో పాటు అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది చివర్లోనే ఈ సినిమా కూడా సెట్స్పైకి వెళ్లే అవకాశముంది.
#SarkaruVaariPaata Nizam Ticket Hike Permission Granted
— Viswa CM (@ViswaCM1) May 9, 2022
Bookings Opens Soon
Get Ready for SuperStar @urstrulyMahesh Mental Mass Swag#SVPMania #SVP pic.twitter.com/bfzAnwr55W
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more